Thursday, April 25, 2024

Breaking: స్టేషనరీపై 18 నుంచి 12 శాతానికి తగ్గిన జీఎస్టీ

స్టేషనరీపై జీఎస్టీ 18నుంచి 12శాతానికి తగ్గింది. ఢిల్లీలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్‌ నేతృత్వంలో జరిగిన ఈ జీఎస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషనరీపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో స్టేషనరీ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. పెన్సిల్‌, షార్ప్‌నర్లపై జీఎస్టీ తగ్గించింది కేంద్రం. అలాగే రాష్ట్రాలకు జూన్‌ వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement