Tuesday, April 16, 2024

Breaking: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కపెటన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. హెలికాప్టర్ ప్రమాదం అనంతరం మృత్యవుతో పోరాడుతూ ఈ రోజు మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కెప్టెన్ వ‌రుణ్ సింగ్ మృతిని భార‌త వాయుసేన అధికారికంగా ప్ర‌క‌టించింది.  

కాగా, తమిళనాడులో ఈ నెల 8న‌ జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య‌ మధులికా రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. వరుణ్ సింగ్ మృతితో ఆ సంఖ్య 14కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement