మెల్ బోర్న్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్ లో విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. 138 విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఒక సమయంలో సమంగా ఉందనుకున్న మ్యాచ్ 15 ఓవర్ల తర్వాత పూర్తిగా ఇంగ్లండ్ వైపు వచ్చింది. ఇంగ్లండ్ జట్టు 19 ఓవర్లలోనే విజయకేతనం ఎగురవేసింది. ఆల్రౌండర్ బెన్స్టోక్స్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి మొయిన్ ఆలీ 19పరుగులతో అండగా నిలిచి చెలరేగి ఆడి ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
- Advertisement -