Friday, March 29, 2024

భార‌త్ జోడో యాత్ర‌లో క‌లిసిన‌ గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు.. ఇదొక చారిత్రాత్మ‌క‌మ‌న్న కాంగ్రెస్

మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడోయాత్ర కొన‌సాగుతుంది. కాగా ఈ పాద‌యాత్ర‌లో రాహుల్ గాంధీని ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు క‌లిసి ఆయ‌న‌తో పాటు అడుగులు వేస్తున్నారు. కాగా నేటి పాద‌యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకుంది. దాంతో రాహుల్ గాంధీని మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిశారు. ఆయనతో కలిసి నడిచారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ… రాహుల్ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం చారిత్రాత్మకమని తెలిపింది. గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం అద్భుతమని చెప్పింది. వీరిద్దరూ ఇద్దరు దివంగత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులుగా అభివర్ణించింది. ఇప్పుడు రాహుల్..తుషార్ ల ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement