Wednesday, April 24, 2024

మామ, తాత‌, తండ్రి, ఎవ్వ‌రూ మంచోళ్ల కాదు.. రేప్ చేశారంటూ విల‌పించిన బాలిక‌!

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఆ బాలికపై క‌న్నేశారు. వావివరుసలు మరచి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పూణేలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దుర్మార్గం బ‌య‌టికి వచ్చింది. పూణేలో ఆ బాలిక చదువుతున్న కాలేజీలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు ఆమె హాజరయ్యింది. అక్కడ తన‌ గోడు వినిపించడంతో ఇంత‌టి భయంకరమైన విషయాలు బయటపడ్డాయి.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్రప్ర‌భ‌

బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పూణే పోలీస్ స్టేషన్లో నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఆమె తండ్రిని అరెస్టు చేసి క‌ట‌క‌టాల్లోకి నెట్టారు. 2016, 2018 సంవత్సరాల్లో తాను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న సమయంలో తన అంకుల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ త‌ర్వాత తన తాత కూడా వేధింపులకు గురి చేసేవాడని బాలిక వేధింపుల క‌మిటీ ముందు క‌న్నీటిప‌ర్యంతం అయ్యింది. 2018లో పూణే వచ్చిన త‌ర్వాత ఈ విష‌యాన్ని తన తండ్రికి చెప్పుకోలేక.. ఓ చీటీలో రాసి ఇచ్చిన‌ట్టు తెలిపింది.

అయితే.. అది చదివిన త‌న‌ తండ్రి తనను హింసించే వారిపై చర్యలు తీసుకుని, తనకు ఓదార్పును, రక్షణను ఇస్తాడ‌ని అనుకున్నాన‌ని, కానీ, తల్లి ఇంట్లో లేని టైమ్‌లో తనపై పలు సందర్భాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది. ఈ దుర్మార్గంపై బాలిక తండ్రితో పాటు ఆమె అంకుల్, తాతపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement