Thursday, March 28, 2024

రేపు హన్మకొండకు గవర్నర్ త‌మిళిసై రాక.. సాంస్కృతిక ఉత్సవాలకు హాజరు..

వరంగల్, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : రేపు హ‌న్మ‌కొండ‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ రానున్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలో రెండ్రోజుల‌ పాటు జర‌గనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గ‌వ‌ర్న‌ర్ పాల్గొన‌నున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే ఈ ఉత్సవాలను ఆమె ప్రారంభిస్తార‌ని అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement