Friday, April 26, 2024

Breaking: బ‌తుక‌మ్మ ఆట‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఎమ్మెల్సీ క‌విత.. అలా అనుకోకుండా జ‌రిగిపోయింది!

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఒకే ద‌గ్గ‌ర అనుకోకుండా ఎదుర‌య్యారు. బ‌తుక‌మ్మ ఆట దీనికి వేదిక అయ్యింది. అనుకోకుండా జ‌రిగిన ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్ స‌మీపంలోని శంషాబాద్ అమ్మ‌ప‌ల్లి ఆల‌యం వ‌ద్ద బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో పాల్గొన‌డానికి వెళ్లారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అక్క‌డ తాము నిర్వ‌హించాల‌నుకున్న షెడ్యూల్ మేర‌కు బ‌తుక‌మ్మ ఆట‌లో పాల్గొన్నారు క‌విత‌.

ఇక‌.. ఇవ్వాల (శుక్ర‌వారం) అదే అమ్మ‌ప‌ల్లి దేవాల‌యాన్ని సంద‌ర్శించుకునేందుకు వెళ్లారు గ‌వ‌ర్న‌ర్‌. అయితే ఈ విష‌యంలో అధికారుల‌కు ఎట్లాంటి స‌మాచారం లేదు. అంతేకాకుండా బ‌తుక‌మ్మ వేడుక‌ల్లోనూ పాల్గొన్నారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే.. అధికారులు మాత్రం కాస్త హైరానా ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement