Friday, April 19, 2024

Breaking: పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. ముగ్గురు మృతి

గూడ్స్ ట్రైన్ ప‌ట్టాలు త‌ప్పి… ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈరోజుల‌ తెల్లవారుజామున కొరాయి రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు ప్లాట్‌ఫామ్‌పై బోల్తాపడ్డాయి. అయితే ప్లాట్‌ఫామ్‌పై వేచిఉన్న ప్రయాణికులపై బోగీలు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెంద‌గా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హుఠాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఉదయం 6.44 గంటలకు కొరాయి స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడి.. స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లాయి. దీంతో భువనేశ్వర్‌ వెళ్లే రైలుకోసం ప్లాట్‌ఫామ్‌పై వేచిఉన్న ప్రయాణికులపైకి బోగీలు దూసుకెళ్లడంతో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. బోగీల కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement