Thursday, April 25, 2024

Goodby | ఐపీఎల్​కు అంబటి గుడ్​బై.. ఫైనల్​​కు ముందే షాకింగ్​ డిసిషెన్​

అంబటి రాయుడు షాకింగ్​ న్యూస్​ చెప్పాడు. ఐపీఎల్ 16వ సీజ‌న్ ఫైన‌ల్ ప్రారంభానికి కొద్ది సేపటి ముందు ఈ విషయం వెల్లడించాడు. ఐపీఎల్‌కు తను గుడ్ బై చెప్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు. ఇదే త‌న‌ ఆఖ‌రి మ్యాచ్ అని అంబ‌టి రాయుడు అందులో పేర్కొన్నాడు. ఈరోజు అత‌డు 200 మ్యాచ్ ఆడ‌నున్నాడు.

‘ముంబై, సీఎస్కే.. ఇవి రెండు గొప్ప జ‌ట్లు. 204 మ్యాచ్‌లు, 14 సీజ‌న్లు, 11 ప్లే ఆఫ్స్, 8 ఫైన‌ల్స్, 5 ట్రోఫీలు సాధించాను. ఈరోజు రాత్రి ఆరో టైటిల్ అందుకుంటాన‌ని న‌మ్ముతున్నా. ఇన్నేళ్ల ప్ర‌యాణం చాలా సాఫీగా సాగింది. ఈ గొప్ప టోర్న‌మెంట్‌లో ఆడ‌డాన్ని నేను ఎంత‌గానో ఆస్వాదించాను. ఇన్ని రోజులు నాకు మ‌ద్ద‌తుగా నిలిచి, నాకు స‌హ‌కారం అందించిన వాళ్లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునే ఆలోచ‌న లేదు’ అని అంబటి రాయుడు తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ముంబై ఇండియ‌న్స్ య‌జ‌మాని ఆకాశ్ అంబానీ, రాయుడు సేవ‌ల గురించి వివ‌రిస్తూ ట్వీట్ పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement