Thursday, April 25, 2024

Good Bye Super Mom: పెంచ్ టైగర్ రిజర్వ్ లో 29 పిల్లలకు జన్మనిచ్చిన పులి మృతి

మధ్యప్రదేశ్​లోని పెంచ్​ టైగర్​ రిజర్వ్​ (పీటీఆర్​)కి చెందిన ఓ పెద్దపులి శనివారం చనిపోయింది. ఇది 16 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉంటోంది. ఆ ఏరియాలో ‘కాలర్​వాలి’గా ఇది ప్రసిద్ధిచెందినట్టు అటవీశాఖ చెబుతోంది. దీని మృతిపై మధ్య ప్రదేశ్​ మంత్రి డాక్టర్​ నరోత్తమ్​ మిశ్రా ట్విట్టర్​లో సంతాపం తెలిపారు.

‘సూపర్​ మామ్​కి చివరి వీడ్కోలు.. 29 పిల్లలకు జన్మనిచ్చిన పెంచ్ టైగర్​ రిజర్వ్​లోని కాలర్​వాలి టైగర్​ మరణ వార్త చాలా బాధేసింది.”అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement