Thursday, April 18, 2024

మేడారం భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. కోటి మందికి బంగారం అందించ‌నున్న ప్ర‌భుత్వం

తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని గిరిజ‌న ఆరాధ్య దైవం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతరలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణ‌యించిన‌ట్టు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ చెప్పారు.

జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కోటి మందికి ‘బంగారం’ పసుపు కుంకుమల ప్యాకెట్లు అందేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న‌ట్టు మంత్రి స‌త్య‌వ‌తి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement