Thursday, April 25, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. గత మూడు రోజుల్లో బంగారం రేటు దిగివచ్చినా.. మళ్లీ ఇవాళ పెరిగింది. వెండి రేటు సైతం మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నా దేశీయ మార్కెట్లో ఇవాళ పెరగడం గమనార్హం. ఈ క్రమంలో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే అమెరికా డాలర్‌ పుంజుకోవడంతో బంగారం, వెండి రేట్లు పడిపోతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1978 డాలర్లకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే ఔన్సుకు 23.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో రూ.82.870 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధర ఇవాళ కాస్త పెరిగింది. గత మూడు రోజులుగా దాదాపు రూ.వెయ్యికి పైగా దిగివచ్చిన గోల్డ్ రేటు ఇవాళ ఏకంగా తులానికి రూ.500 పెరిగింది.

ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.56 వేల 300 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.61 వేల 420 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.56 వేల 450 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ తులానికి రూ.550 పెరిగి రూ.61 వేల 570కి చేరింది. హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కిలోకు రూ.1000 పెరిగి రూ.79 వేలు పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ కిలో వెండి రేటు రూ.1000 పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.75 వేల 300 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా, బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement