Wednesday, April 17, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 850 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాములకు ఇవాళ రూ.440 పెరిగి రూ.60 వేల 930 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 10 గ్రాములకు రూ. 56 వేలు పలుకుతోంది. మరోవైపు.. 24 క్యారెట్ల ఇట‌ఏన‌మేలిమి గోల్డ్ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ.450 పెరిగింది. ప్రస్తుతం రూ.61 వేల 80 వద్ద ట్రేడవుతోంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.200 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు ఢిల్లీలో రూ.72 వేల 800 పలుకుతోంది. మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ కిలో వెండి రేటుపై రూ.300 పెరిగింది. ప్రస్తుతం రూ.76 వేల 800 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు ఎక్కువ, గోల్డ్ రేటు తక్కువగా ఉంటుంది. అందుకు పన్నులు, కమీషన్లు వంటివి కారణం అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement