Thursday, April 25, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఆగస్టు 13న తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలుకాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 52,090కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 400 దూసుకుపోయింది. రూ. 47,750కు చేరింది. పది గ్రాముల బంగారానికి ఈ రేట్లు వర్తిస్తాయి. వెండి ధర కూడా మెరిసింది. రూ. 200 పైపైకి చేరింది. కేజీ వెండి రేటు రూ. 64,400కు చేరింది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టాయి. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.62 శాతం మేర పెరిగింది.

దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1818 డాలర్లకు చేరింది. అలాగే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు 2.3 శాతం మేర పైపైకి చేరింది. ఔన్స్‌కు 20.83 డాలర్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలకు రెక్కలు రావడంతో ఆ ప్రభావం మన మార్కెట్‌పై కనిపించింది.విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.47,750 వద్ద ఉంది. రూ. 400 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090 వద్ద కొనసాగుతోంది. రూ. 440 పైకి చేరింది. విశాఖ పట్నంలో చూస్తే ఆర్నమెంటల్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,750 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 52,090 వద్ద ఉన్నాయి. పది గ్రాముల బంగారానికి ఈ రేట్లు వర్తిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement