Thursday, April 25, 2024

కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

బంగారం మ‌హా ప్రియంగా మారింది. బంగారం ధ‌ర‌లు రోజుకోలా మారుతుంటాయి. కాగా నేడు దేశ వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు భారీ గా త‌గ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 250 వ‌ర‌కు త‌గ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 270 వ‌ర‌కు త‌గ్గింది. అయితే తెలుగు రాష్ట్రా ల లో స‌రిగ్గా పెళ్ళిల సీజ‌న్ లో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డంతో బంగారం వినియోగ దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు ఎక్కువ గా పెర‌గ‌డం లేదు. ఈ రోజు అయితే ఏకంగా రూ. 270 వ‌ర‌కు త‌గ్గింది. అయితే మ‌న దేశ ఆర్థిక రాజధాని ముంబై న‌గ‌రంలో మాత్రం బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పం గా పెరిగాయి. కాగ ఈ రోజు దేశ వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వ‌ర‌కు త‌గ్గి రూ. 45,750 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 270 వ‌ర‌కు త‌గ్గి రూ. 49,910 వ‌ద్ద ఉంది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వ‌ర‌కు త‌గ్గి రూ. 45,750 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 270 వ‌ర‌కు త‌గ్గి రూ. 49,910 వ‌ద్ద ఉంది. మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వ‌ర‌కు త‌గ్గి రూ. 47,900 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 280 వ‌ర‌కు త‌గ్గి రూ. 52,250 వ‌ద్ద‌ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement