Tuesday, April 23, 2024

కొండెక్కిన బంగారం ధ‌ర‌-త‌గ్గిన వెండి

నేడు బంగారం ధ‌ర‌లు పెరిగాయి. ఏకంగా ఒక్క రోజులోనే రూ.500 మేర ధర పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.46,500కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.530 పెరిగి రూ.50,730కి చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో.. వెండి రేట్లు మాత్రం కిందకి దిగొచ్చాయి. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.62,500గా నమోదైంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల పెరుగుదల ఈ స్థాయిలోనే ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.46,650కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.50,890గా నమోదైంది. అయితే ఢిల్లీలో వెండి రేట్లు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర అక్కడ రూ.1,200 తగ్గి రూ.56,800గా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement