Thursday, April 18, 2024

మన ‘బంగారం’.. రాష్ట్ర‌స్థాయి బాక్సింగ్​ పోటీల్లో వివేకవర్థిని ప్ర‌తిభ‌, పసిడి పతకం సొంతం

కుల్కచర్ల, (ప్రభ న్యూస్): తెలంగాణ‌లోని వికారాబాద్‌ జిల్లాలోని ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ విద్యార్థిని అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటోంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన బాక్సింగ్ పోటీల్లో విజ‌య‌ప‌తాక ఎగ‌రేసి బంగారు ప‌తాకాన్ని సొంతం చేసుకుంది. కుల్క‌చ‌ర్ల మండల పరిధిలోని కామన్ పల్లి గ్రామానికి చెందిన వివేకవర్థిని ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో బాక్సింగ్ విభాగంలో చదువుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న రాష్ట్రస్థాయి (33-35) కేజీల బాక్సింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించింది.

ఈ సందర్భంగా మండలానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ చూపడం, బంగారు పతకం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు ఆటలను అలవర్చుకోవడం అభినందనీయమని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement