Thursday, April 25, 2024

పసిడి రేటు పైపైకి… ఇవాళ్టి రేట్లు ఇలా..

బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.48,770కు చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.150 పెరుగుదలతో రూ.44,700కు చేరింది.

మరోవైపు వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,300 చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement