Tuesday, April 16, 2024

Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రెట్లు ఎంతంటే..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అక్షయ తృతీయ ముందు నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.47,400కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.420 పెరుగుదలతో రూ.51,700కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. వెండి ధర ఈ రోజు రూ.700 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,700కు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement