Thursday, April 18, 2024

Gold News: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట. బంగారం, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,610కు ఎగసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరుగుదలతో రూ. 48,660కు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. వెండి రేటు రూ. 100కి పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 64,600కు చేరింది.

విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,610గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,660కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 64,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,760గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,010కి చేరింది. కిలో వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,610 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,610కి చేరింది. కిలో వెండి ధ‌ర రూ. 60,700గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement