బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన పసిడి రేటు ఈరోజు పెరిగింది. బంగారం దారిలోనే వెండి రేటు కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.49,040కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.44,950కు చేరింది.
ఇక, వెండి ధర కూడా పసిడి దారిలో నడిచింది. వెండి రేటు ఈరోజు రూ.600 పెరిగింది. దీంతో కేజీ వెం ధర రూ.65,600కు చేరింది.