Friday, April 19, 2024

గ్లామ‌ర్ డోస్ పెంచిన స‌మంత – బాత్ రూంలో ట‌వ‌ల్ చుట్టుకుని సెల్ఫీ

రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకుంటుంది స్టార్ హీరోయిన్ స‌మంత‌. తాజాగా ఇన్స్టా స్టోరీలో ఆమె ఓ హాట్ మిర్రర్ సెల్ఫీ షేర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సమంత తన స్టైలిస్ట్ .. క్లోజ్ ఫ్రెండ్ అయిన నీరజా కోన నుండి వచ్చిన ఒక నోట్ ను రిసీవ్ చేసుకున్నానని తెలుపుతూ ఓ స్టీమీ మిర్రర్ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో సామ్ ఫేస్ కనిపించినప్పటికీ.. ఆమె ఈ ఫోటో తీస్తున్నప్పుడు ఒక చేత్తో టవల్ ని మరో చేత్తో మొబైల్ పట్టుకొని ఉంది. మిర్రర్ సెల్ఫీకి నీరజా కోనా రాసిన నోట్ ను కూడా అటాచ్ చేసింది సామ్. అందులో ‘పాపా.. లవ్ యూ! నువ్ అద్భుతంగా ఉన్నావ్. అది గుర్తుంచుకో’ అని రాసి ఉంది. దీనికి సమంత క్యాప్షన్ ఇస్తూ ‘ఆవ్ నీరజా.. నేను ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నాను. తిరిగి వచ్చేయ్. క్యూట్ నోట్ కి ధన్యవాదాల‌ని చెప్పింది. సమంత బాత్రూమ్ లో టవల్ పట్టుకొని మిర్రర్ సెల్ఫీ షేర్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు విడాకుల తర్వాత మళ్ళీ హద్దులు చేరిపేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ లో క్లీవేజ్ షో చేయడమే కాదు.. ఇటీవల పలు మ్యాగజైన్స్ కు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేయడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇకపోతే సామ్ ఈ ఫొటోతో పాటుగా ప్రస్తుతం తాను విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న #VD11 కాశ్మీర్ షెడ్యూల్ విశేషాలు.. షూటింగ్ లొకేషన్స్ మరియు అక్కడ ఆనందంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కూడా ఆనందాన్ని పంచుతోంది. షూటింగ్ కోసం గత రెండు వారాలుగా కశ్మీర్ లో ఉన్న సమంత.. పహల్గామ్ ప్రాంతంలోని హోటల్ లో ఆనందిస్తున్న దృశ్యాలను పంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement