Tuesday, April 23, 2024

NZB: దొంగతనం నింద భరించలేక బాలిక ఆత్మహత్య

దొంగతనం నింద భరించలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నవీపేట మండలం శివతాండలో ఈ విషాద ఘటన జరిగింది. తల్లితో మాట్లాడేందుకు వందన అనే బాలిక పక్కింటి ఫోన్ తీసుకుంది. ఫోన్ పౌచ్ లో రూ.600లు దొంగిలించిందని వందనపై.. ఇంటి పక్కన వ్యక్తులు ఆరోపణలు చేశారు. మనస్తాపంతో వందన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement