Saturday, April 20, 2024

ఘజియాబాద్ జైలులో.. 140మంది ఖైదీలకి హెచ్ ఐవీ

హెచ్ ఐవీ సోకిన ఖైదీలు 140మంది ఉన్నారని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు చేయించడం తప్పనిసరి. దీంతో 2016లో జైలుకు వచ్చిన 49 మంది ఖైదీలు హెచ్ఐవీ బాధితులని తేలింది. అప్పటి నుంచి ఆ ఖైదీలు జైలులోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ సోకిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అధికారులు తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వివరించారు.


హెచ్ఐవీ బాధితులకు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు దస్నా జైలు అధికారులు తెలిపారు. దస్నా జైలు ఖైదీలతో కిక్కిరిసి పోయిందని అధికారులు చెప్పారు. జైలులో 1,706 ఖైదీలను ఉంచేందుకు మాత్రమే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5,500 మంది ఖైదీలు ఉన్నారట. కాగా, రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసే ఈ వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement