Saturday, April 20, 2024

Huzurabad by election: గెల్లు శ్రీనివాస్ నామినేషన్

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల పర్వం మొదలైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్​ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.  హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్​ వేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది. 

2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న గెల్లు శ్రీనివాస్​పై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపారు. 2017 నుంచి టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: టాటా చేతికి ఎయిరిండియా

Advertisement

తాజా వార్తలు

Advertisement