Tuesday, April 16, 2024

అర్థరాత్రి టెన్షన్..లీకైన గ్యాస్

మహారాష్ట్రలోని బద్దాపూర్‌లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్‌ లీకైంది. పెద్ద ఎత్తున గ్యాస్‌ లీకేజీ కావడంతో చుట్టు పక్కల వ్యాపించడంతో స్థానికులు కళ్ల మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురువారం రాత్రి 10.22 ప్రాంతంలో నోబెల్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో జరిగింది. సంస్థలోని సల్ఫ్యూరిక్, బెంజైల్ ఆమ్లాల మధ్య రసాయన ప్రతిచర్యతో వేడెక్కడం వల్ల గ్యాస్ లీకేజీ ఏర్పడిందని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. సమాచారం అందిన తర్వాత ఫ్యాక్టరీకి చేరుకొని రాత్రి 11.24 గంటలకు లీకేజీని నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అగ్నిమాపక దళం అధికారి పేర్కొన్నారు. ప్రమాదంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement