Thursday, April 25, 2024

ఆలియాభ‌ట్ పోస్ట‌ర్ తో రెస్టారెంట్ కు వ‌చ్చే మ‌గ‌వారికి డిస్కౌంట్స్ – విమ‌ర్శిస్తోన్న నెటిజ‌న్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభ‌ట్ న‌టించిన గంగూబాయ్ క‌తియావాడి చిత్రం పోస్ట‌ర్ ను వాడి విమ‌ర్శ‌ల‌పాల‌యింది ఓ రెస్టారెంట్ యాజ‌మాన్యం. ఈ సినిమాలో విటులను అలియాభట్ చేతితో సైగ చేస్తూ ఆహ్వానం పలికే సీన్ ఉంటుంది. సరిగ్గా ఇదే సీన్ ను పోస్టర్ గా ముద్రించి తన రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు ఓ పాకిస్థానీ. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై చాలా మంది పాకిస్థాన్ రెస్టారెంట్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అలియాభట్ పోస్టర్ ను వాడుకుంటూ రెస్టారెంట్ కు వచ్చే మగవారికి డిస్కౌంట్లు ప్రకటించడమే వివాదానికి దారితీసింది. మెన్స్ మండే పేరుతో కరాచీలోని ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది. మగవారికి బిల్లులో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ప్రకటనలో ’‘ఆజా నా రాజా – దేనికోసం ఎదురు చూస్తున్నావు?. ఆజావో.. మెన్స్ మండే రోజు 25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకో’’ అన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. నీవు పెట్టిన సీన్, ఇస్తున్న ఆఫర్ స్త్రీ ద్వేషాన్ని, నీ అజ్ఞానానికి నిదర్శనం’’ అని ఓ యూజర్ మండిపడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement