Friday, April 19, 2024

జీ5లో రిప‌బ్లిక్..సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆడియో మెసేజ్..

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ చిత్రాన్ని రీసెంట్ గా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. కాగా ఈ నెల 26న ఈ చిత్రాన్ని జీ5లో రిలీజ్ చేయ‌నున్నారు. దాంతో ఓ ఆడియో మెసేజ్ ను తేజ్ రిలీజ్ చేశారు. ఈ మెసేజ్‌కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్‌ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు.

రిపబ్లిక్ సినిమాను థియేటర్‌లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందన్నారు.ఈ సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివరిలో జై హింద్ అని ముగించారు. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో పక్కటెముకలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ మళ్లీ తన కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement