Saturday, April 20, 2024

Video: పండుగ‌పూట‌ ఫన్నీ ఇన్సిడెంట్.. దోశ‌లు వేసిన‌ చిరంజీవి.. కుళ్లుతో ఏం చేశాడంటే..

సంక్రాంతి పండుగకు మెస్టార్‌ చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌కు వెరైటీ ట్రీట్ ఇచ్చారు. హీరో, నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ తేజ‌తో క‌లిసి దోశ‌లు వేస్తూ సంద‌డి చేశారు. భోగి పండుగ సంబురాల్లో భాగంగా ఈ దోశ‌లు వేసి కుటుంబ స‌భ్యుల‌కు అందించిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ దోశ‌లు పోస్త‌న్న‌ప్పుడు వ‌రుణ్ తేజ్ వేసిన దోశ బాగా రావ‌డం.. చిరు వేసిన దోశ స‌రిగ్గా రాక‌పోవ‌డం క‌నిపించింది. దీంతో చిరంజీవి స‌ర‌దాగా వీడి దోశ చూస్తే నాకు కుళ్లొచ్చేస్తుంది.. అంటూ దాన్ని గ‌రిట‌తో చెరిపేశారు. ప‌లుమార్లు దాన్ని గ‌రిట‌తో చెడ‌గొట్టి ఇప్పుడు ఇది దోశ కాదు.. ఉప్మా అంటూ ఫ‌న్నీగా చెబుతాడు.. దీంతో వారి కుటుంబ స‌భ్యులంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌డం వినిపిస్తుంది.. ఇప్పుడీ వీడియోను వ‌రుణ్ తేజ్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేయ‌గా.. నెటిజ‌న్లు స‌ర‌దాగా రీ షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement