Friday, April 19, 2024

Kudos to our CM | హరితహారంతో వన్యమృగాలకు స్వేచ్ఛ, ఇదిగో సాక్ష్యం.. ఎంపీ సంతోష్​ ట్వీట్​!

తెలంగాణలో నిత్యం ఏదో చోట చిరుత పులులు తిరుగుతున్నాయి. తాజాగా మహబూబ్​నగర్​ జిల్లా అప్పనపల్లి దగ్గర చిరుత సంచారం కనిపించింది. ఈ విషయాన్ని బీఆర్​ఎస్​ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్​ ట్విట్టర్​లో తెలియజేశారు. ‘‘ఈ విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నా.. సీఎం కేసీఆర్​ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పచ్చదనంతో పాటు అడవుల విస్తీర్ణం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో వన్యప్రాణులు, మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

ఇవ్వాల (శనివారం) మహబూబ్​నగర్​ జిల్లా అప్పనపల్లి దగ్గరున్న కేసీఆర్​ అర్బన్​ పార్క్​లోని గోల్​బంగ్లా వాచ్​ టవర్​ వద్ద ఓ చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు​ అయ్యాయి. తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమమే దీనికి కారణం అని ఎంపీ సంతోష్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు. అంతేకాకుండా ట్వీట్​లో చిరుత సంచరిస్తున్న వీడియో, ఫొటోలను షేర్​ చేశారు. సీఎం కేసీఆర్​కు కుడోస్​ అంటూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement