Tuesday, April 16, 2024

నాలుగవ రోజు లాభాలతో ముగిసిన .. స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే దూసుకుపోయాయి. కాగా వరుసగా నాలుగవ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేంత వరకు మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో పాటు… విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 61,121కి చేరుకుంది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 18,145 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ (5.00%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.39%), ఇన్ఫోసిన్ (2.27%), టీసీఎస్ (2.08%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. యాక్సిస్ బ్యాంక్ (-3.76%), మారుతి (-0.94%), రిలయన్స్ (-0.78%), టాటా స్టీల్ (-0.34%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement