Thursday, March 28, 2024

అభిమానం సల్లగుండ.. ఎంతపనాయే పో!

క్రికెటర్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాలనే కోరికతో నిన్న రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ప్లే ఏరియాలోకి ప్రవేశించిన ఇద్దరు టీనేజ‌ర్లతో సహా నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. భారత్-శ్రీలంక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా వీరు స్టేడియంలోకి ఎంటర్​ అయ్యారు. మ్యాచ్ రెండో రోజు రాత్రి 9.20 గంటల ప్రాంతం.. మెడికల్ బ్రేక్ సమయంలో నలుగురు వ్యక్తులు ప్లే ఏరియాలోకి దొంగచాటుగా ప్రవేశించారు.

దీంతో వెంటనే అలర్ట్​ అయిన పోలీసు అధికారులు, నిర్వాహకులు వారిని పట్టుకున్నారు. విచారణ నిమిత్తం నలుగురిని కబ్బన్‌పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారిపై IPC సెక్షన్లు 447, 269, 271 తో వారిపై క్రిమినల్ కేస్ కూడా న‌మోదు చేసినట్టు తెలుస్తోంది. అభిమానంతో వెళ్తే పోలీసు కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని వారు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement