Friday, March 29, 2024

Flash: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్‌రామ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు.
సుఖ్‌రామ్ ఈ నెల 4న మనాలిలో బ్రెయిస్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

మే 7న న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఢిల్లీకి తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రభుత్వ హెలికాప్టర్‌ను పంపారు. 1993 నుంచి 1996 వరకు సమాచారశాఖ సహాయమంత్రిగా సుఖ్‌రామ్ పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఐదుసార్లు విధాన సభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జర్మనీ నుంచి గోవులను దిగుమతి చేసుకోవడం ద్వారా రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచడంలో సుఖ్ రామ్ కీలక పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement