Thursday, April 25, 2024

2022 netaji award: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి.. నేతాజీ అవార్డు ప్రదానం

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో ఆదివారం ‘‘నేతాజీ అవార్డు 2022’’ను ప్రదానం చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ న్యూఢిల్లీ నుండి ప్రసంగించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్.. నేతాజీ మనవడు సుగతా బోస్.. జపాన్ మాజీ ప్రధాని అబేను నేతాజీకి గొప్ప ఆరాధకుడిగా అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement