Friday, April 19, 2024

బ్యాంకులో నగలు కొట్టేసేందుకు సూపర్ స్కెచ్.. ఎలా దొరికిపోయాడో తెలుసా?

బ్యాంకులో నగదు, బంగారం కొట్టేసేందుకు ఓ బ్యాంకు మాజీ ఉద్యోగి గ్రేట్ స్కెచ్ వేశాడు. బ్యాంక్ క్లోజ్ చేసే టైమ్లో బ్యాంకులోనే ఉండిపోయాడు. అట్లా 1.6కిలోల బంగారు ఆభరణాలు దోచుకోవడానికి ప్లాన్ వేశాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్మీపూర్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడు, బ్యాంక్ కాంట్రాక్టు ఉద్యోగి అయిన శేఖర్ కులదీప్. 2014 ఆగస్టు 2020 మధ్య SBI లక్ష్మీపూర్ మెసెంజర్‌గా పని చేస్తున్నాడు. ఇంతకుముందే ఫ్రాడ్ చేసినందుకు గతంలో మెసెంజర్ సర్వీస్ నుండి తీసేశారు.

అయితే నవంబర్ 2021లో బ్యాంక్ లాకర్ నుండి బంగారు ఆభరణాలు దొంగతనం జరిగినప్పటికీ అధికారులు గుర్తించలేదు. కాగా, తన లాకర్ నుండి ఆభరణాలు మిస్ అయ్యాయని ఒక కస్టమర్ తనకు తెలియజేయడంతో ఈ ఘటనకు సంబంధించి బ్రాంచ్ మేనేజర్ జనవరి 14న అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు లాకర్‌లో 1.6 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కోరాపుట్ పోలీసులు బ్యాంక్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో బ్యాంకు మాజీ ఉద్యోగి శేఖర్ కులదీప్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా అతడు బ్యాంకుకు నిత్యం వచ్చేవాడని వెల్లడైంది. అయితే, అతను గత ఒకటిన్నర నెలలుగా బ్యాంకుకు రావడం మానేశాడు. కోరాపుట్ ఎస్పీ వరుణ్ గుంటుపల్లి మాట్లాడుతూ.. కులదీప్ నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం ఏదో పని నిమిత్తం బ్యాంకులోకి ప్రవేశించాడు. ఎలాగోలా రాత్రంతా ఆవరణలో దాక్కున్నాడని తెలిపారు. “ఆ తర్వాత అతను బ్యాంకులోని కంప్యూటర్ సర్వర్ గదిలో దాక్కున్నాడు. బ్యాంకు గదిలో కులదీప్ ఉన్న విషయం తెలియక బ్యాంకు ఉద్యోగులు బ్యాంకింగ్ సమయం ముగిసిన తర్వాత రాత్రి 8 గంటలకు గేట్లకు తాళం వేశారు. రాత్రి, కులదీప్ రహస్య స్థావరం నుండి బయటకు వచ్చి ఎక్కడ తాళాలు ఉన్నాయో తెలుసుకుని స్ట్రాంగ్ రూమ్ లాకర్ కీ కోసం నేరుగా బ్రాంచ్ మేనేజర్ గదికి వెళ్లాడు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌, లాకర్‌లోని 21 ప్యాకెట్లలో ఉంచిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లి మళ్లీ బ్యాంకు టాయిలెట్‌లో దాచాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సాధారణ లావాదేవీల కోసం బ్యాంకు తెరిచిన తర్వాత అతను దొంగచాటుగా బయటికి వచ్చాడు, ”అని ఎస్పీ వివరించారు.

ముఖ్యంగా శేఖర్‌కు బ్యాంకు లోపల ఉన్న ప్రతి స్థలం గురించి తెలుసు కాబట్టి అతను స్ట్రాంగ్ రూమ్ మరియు ఐరన్ సేఫ్ తాళాలను యాక్సెస్ చేయగలిగాడు. లాకర్‌ను ఈజీగా దోచుకున్నాడు.
నారాయణపట్న పోలీసు పరిధిలోని అతని స్వస్థలమైన బిక్రంపూర్ గ్రామం నుండి శేఖర్‌ను అరెస్టు చేయగా అతను తన నేరాన్ని అంగీకరించాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా రూ.2.95 లక్షల నగదు, రూ.1.1 లక్షలకు పైగా విలువైన గృహోపకరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరులో లక్ష్మీపూర్ ప్రాంతంలో భవన నిర్మాణానికి సుమారు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాడు. భవనాన్ని కూడా స్వాధీనం చేసుకునే పనిలో పోలీసు అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement