Thursday, March 28, 2024

క్రికెట్ నిర్వ‌హ‌ణ‌పై – క‌పిల్ దేవ్ కీల‌క వ్యాఖ్య‌లు

భార‌త్ కి తొలి ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన మాజీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యూర‌ప్ లో ఫుట్ బాల్ లా మన క్రికెట్ కూడా తయారవుతోందన్నారు. యూరప్ లో ఫుట్ బాల్ టీమ్ లు, ప్లేయర్లు ప్రతి దేశంతో ఆట ఆడటం లేదని.. వారు కేవలం నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్ లో మాత్రమే ఆడతారన్నారు. ఇప్పుడు మన క్రికెట్ కూడా అదే మార్గంలో వెళుతున్న పరిస్థితి ఉందని.. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యాఖ్యానించారు. వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లను కాపాడేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఐసీసీ కేవలం టీ20 ఫార్మాట్ క్రికెట్‌ ను మాత్రమే కాకుండా.. వన్డేలు, టెస్టుల ఫార్మాట్ ను బతికించడానికి తగినంత సమయం కేటాయించాలని కోరారు. ఇప్పటికే క్రికెట్ షెడ్యూల్స్ పూర్తి షెడ్యూల్‌ తో నడుస్తున్న పరిస్థితి ఉందని.. ఇలాంటి సమయంలో టీ20 లీగ్ లు మరింత ఒత్తిడి పెంచుతున్నాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ తదితర దేశాలు టీ20 లీగ్ ల కోసం తమ జట్లకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని భావిస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ నిర్వహణకు సంబంధించి కపిల్ దేవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement