Thursday, April 25, 2024

Floods: దంచికొడుతున్న వాన‌లు.. డేంజ‌ర్‌లో చెన్నై సిటీ

ఈశాన్య రుతుప‌వ‌నాల కార‌ణంగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై సిటీని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా చెన్నైలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వీధుల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తుండ‌గా.. ప‌లు ఇండ్ల‌లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



ఈ క్ర‌మంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో త‌మిళ‌నాడు సీఎం MK స్టాలిన్ ప‌ర్య‌టించారు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తూనే త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు అధికారుల‌ను ఆదేశించారు. ఎన్‌డీఆర్ ఎఫ్ టీమ్‌ల‌తో ఎక్క‌డిక‌క్క‌డ బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి:

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement