Saturday, April 20, 2024

Flash.. Flash: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య..

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ లో హత్య కలకలం రేపింది. గ్రామంలోని పంచరు షాపు యజమాని బిహార్ రాష్ట్రం మహువ జిల్లాకు చెందిన ముకేష్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. షాపులో పనిచేస్తున్న బిహార్ కు చెందిన చందన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఓ లారీ గాలి కొట్టించుకునేందుకు వచ్చిన సందర్భంలో యజమాని ముఖేష్ కుమార్ తో లారీ డ్రైవర్ గొడవపడి వెళ్లిపోయాడని తెలిపాడు.

అనంతరం ఒక కారులో నలుగురు వ్యక్తులు వచ్చి ముఖేష్ కుమార్ పై కారం చల్లి బండరాయితో తలపై బాది హత్య చేసినట్లు వివరించాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత నగర్ ఎస్ఐ మహేందర్ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement