Thursday, March 28, 2024

బాక్సాఫీస్ సందడి: ఇవాళ ఐదు సినిమాలు రిలీజ్

టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద మళ్లీ సినిమాల సందడి మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశంలో ఏ భాషలోను సినిమా రంగం పుంజుకోలేదు. భారతీయ సినిమా రంగంలో థియేట్రికల్ వ్యాపారం తిరిగి పుంజుకుంటున్న ఏకైక సినిమా పరిశ్రమ టాలీవుడ్. థియేటర్లు తిరిగి తెరిచినప్పటి నుండి ఎన్నో చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. నెమ్మదిగా ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం 5 సినిమాలకు తక్కువ కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. రానురానూ చిన్న సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం కూడా ఐదు కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

అందులో మొదటగా చెప్పుకోవాల్సింది  “శ్రీదేవి సోడా సెంటర్”. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రభాస్, మహేష్ వంటి స్టార్ హీరోలు సపోర్ట్ చేయడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. “ఇచ్చట వాహనములు నిలుపరాదు “అల వైకుంఠపురములో” తర్వాత సుశాంత్ నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ ఇది. ఎస్. దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు  హౌస్ అరెస్ట్, సూర్యాస్తమయం, గ్రేట్ శంకర్ కూడా ఇవాళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: మెగాస్టార్ 154 @వాల్తేరు శీను

Advertisement

తాజా వార్తలు

Advertisement