Friday, April 19, 2024

న‌డిరోడ్డుపై భ‌గ్గుమ‌న్న బ‌స్సు.. ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన ముప్పు

నిర్మల్ ప్రతినిధి, ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ బ‌స్సు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న పూజ ట్రావెల్స్ బస్సు (LH 40AT 9966) ఇంజిన్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపేశాడు. కాసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ బస్సులో 29 ప్రయాణికులు ఉన్నారు వారందరు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి సోన్ పోలీసులు చేరుకొని పరిస్థితి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement