Tuesday, March 26, 2024

హైద‌రాబాద్‌లో అగ్నిప్రమాదం.. స్క్రాప్‌ దుకాణంలో చెలరేగిన మంటలు

హైద‌రాబాద్ సిటీ శివారులోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆరాంఘర్‌ చౌరస్తా ద‌గ్గ‌రున్న ఓ స్క్రాప్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది.

ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో ఎవ‌రికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క‌రెంట్ షార్ట్ స‌ర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement