Saturday, April 20, 2024

రోడ్డుపై సిగరెట్ పీక.. రూ.55వేల జరిమానా

సిగరెట్ పీకని రోడ్డుపై పడేసినందుకు రూ.55వేల జరిమానా విధించింది ఇంగ్లాండ్ కోర్టు. సిగరెట్ తాగి పీకను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల రోడ్లపై చెత్త తయారవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించింది. టౌన్ లో అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి సిగరెట్ తాగి, పీకను రోడ్డుపై పడేశాడు. స్ట్రీట్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇది చూసి అలెక్స్ కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు. ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అలెక్స్ ఈ ఆదేశాలను లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. దీంతో అలెక్స్ ను అధికారులు కోర్టుకీడ్చారు. రోడ్లపై చెత్త పడేశాడని, జరిమానా చెల్లించేందుకు ఇష్టపడలేదని ఆరోపించారు. కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్ కు రూ.55 వేలు జరిమానా విధించారు.ఇంగ్లాండ్ లోని థోర్న్ బరీ టౌన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement