Friday, March 29, 2024

Breaking: ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లాలోని నర్సింగాపూర్ లో తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల మృత‌దేహాల‌ను బావిలో నుంచి వెలికితీశారు. మృతులు తండ్రి జలపతిరెడ్డి, పిల్లలు ప్రణీత (11), మధుమిత (9)గా గుర్తించారు. అయితే జలపతిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement