Thursday, March 28, 2024

ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఏడుగురు మృతిచెందిన ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెంద‌గా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమంయంలో వాహనంలో 11 మంది ఉన్నారు.

వివ‌రాలిలా ఉన్నాయి… ఝార్సుగూడ జిల్లాలోని లఖన్​పుర్​ పరిధిలోని బదాధార గ్రామానికి చెందిన 11 మంది.. సంబల్​పుర్​లోని పరమన్​పుర్​లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. అనంతరం నిన్న అర్ధరాత్రి ఒంటిగంటకు తిరుగు ప్రయాణమయ్యారు. సంబల్​పుర్ జిల్లా ససన్​ కాలువ​ వద్దకు రాగానే.. వాహనం అదుపుతప్పి కెనాల్​లో పడిపోయింది. ఆ సమయంలో నలుగురు బయటపడగా.. మిగతా ఏడుగురు బయటకు రాలేక ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు అజిత్ ఖమారి, దివ్య లోహా, సుబల్ భోయ్, సుమంత్ భోయ్, సరోజ్ సేథ్, రమాకాంత్ భోయ్, బొలెరో డ్రైవర్ శతృఘ్న భోయ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement