Wednesday, April 24, 2024

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థుల మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఐదుగురు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, మ‌రో ఐదుగురు గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. కాంకేర్‌ జిల్లా భానుప్రతాప్‌పూర్‌లో ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు.. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భానుప్రతాప్‌పూర్‌ – కాంకేర్‌ మధ్య కోరేర్‌ సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెంద‌గా, మరో ఐదుగురు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement