Saturday, April 20, 2024

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ క‌న్నుమూత

చిత్ర పరిశ్రమలో ఇటీవలే సీనియర్ నటి జమున మృతిచెందగా.. తాజాగా ప్రముఖ తెలుగు దర్శకుడు సాగర్ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, అన్వేషణ లాంటి సినిమాలను సాగర్ తీశారు. సాగర్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement