Friday, April 19, 2024

Warangal : రూ.2కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత.. 15మంది అరెస్ట్

వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల వియాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్ ఫోర్సు, మడికొండ, ఏనుమాముల పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి సంయుక్తంగా అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. వీరి నుండి రెండు కోట్ల పదకొండు లక్షల విలువ గల నకిలీ విత్తనాలు, ఏడు టన్నుల విడి విత్తనాలు, 9వేల 765 నకిలీ విత్తనాల ప్యాకేట్లు, ఒక డిసియం, ఒక కారు, 21లక్షల రూపాయల నగదు, నకిలీ విత్తనాల ప్యాకేట్ల తయారీ కోసం అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠా సభ్యుల్లో 1. దాసరి శ్రీనివాస్, కర్నూల్ జిల్లా, ఆంద్రప్రదేశ్, 2. చేదాం పాండు, హైదరాబాద్, 3. కొప్పుల రాజేష్, మంచిర్యాల్, 4 వడిచర్ల సురేందర్ రెడ్డి, చంద్రపూర్, మహరాష్ట్ర, 5. ఏన్గూడే దిలీప్, బలార్ష, మహరాష్ట్ర, 6. బోగే సత్యం, మంచిర్యాల, 7. షేక్ అన్జద్, మంచిర్యాల, 8.ఇందుర్తి వెంకటేష్, మంచిర్యాల, 9. పుట్ట రాజేశం, మంచిర్యాల, 10. చేదాం వెంకటరమణ, హైదరాబాద్, 11. చేదాం నాగరాజు, మహబూబాబ్నగర్, 12. సుందర్ శెట్టి ఫణీందర్, బాపట్ల, ఆ.ప్ర, 13. కాల్వ శ్రీధర్, నాగర్ కర్నూల్ జిల్లా, 14. తాప్తే హనుమంతు, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, 15. వేముల అరవింద్ రెడ్డి, హైదరబాద్ కు చెందిన వారిని అరెస్టు చేయగా ప్రస్తుతం పరారీలో వున్నావారు శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, గంప సదాశివ్ వున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ… ఒక ముఠాలోని సభ్యులు రైతుల నుండి తక్కువ ధరకు విడిగా విత్తనాలు కొనుగోలు చేసిన వాటిని ఈ ముఠాలోని ప్రధాన నిందితులు దాసరి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న విత్తన కంపెనీలకు తరలించి అక్కడ విత్తన శుద్ధి చేసేవారన్నారు. శుద్ధి చేసిన నకిలీ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేదించిన బి.జి.3. ఎచ్ టి పేరు గల పత్తి విత్తనాలు గడ్డి మందును తట్టుకొని, ఎక్కువమార్లు కలుపు తీయాల్సిన అవసరం వుందడని, ఈ విత్తనాలు అధికృత డీలర్ల వద్ద విక్రయాలకు వుండవంటూ రైతులను ఎక్కువ ధరలకు వివిధ రకాల పేరున్న విత్తన కంపెనీల పేర్లతో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వాటిని వరంగల్ నగరానికి తీసుకువచ్చేవారన్నారు. ఇక్కడి నుండి తెలంగాణ, మహరాష్ట్రల్లోని జిల్లాలకు చెందిన విత్తన డీలర్లకు, రైతులకు ఈ ముఠా విక్రయించేవారన్నారు. మరో ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు చేదాం పాండు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, శ్రీగణేష్ విత్తన శుద్ది కంపెనీ వున్నాయన్నారు. ఈ కంపెనీ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదాసాగర్ కంపెనీ నుండి దిగుమతైన విత్తనాలను ఈ కంపెనీల ద్వారా ఉప విక్రయ లైసెన్టారుడిగా వుంది తెలంగాణలోని వివిధ జిల్లాలకు విత్తనాలు విక్రయించేవాడన్నారు. ఇదే అదునుగా భావించిన ఈ నిందితుడు మరికొందరితో కలిపి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు అసలైన నర్మద కంపెనీ చెందిన విత్తన ప్యాకేట్లను తీసిపోని విధంగా క్యూఆర్ కోడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, యం.ఆర్.పిలతో కూడిన నకిలీ నర్మదా విత్తన ప్యాకేట్లను తయారు చేసిన వీటిలో నకిలీ విత్తనాలు వుంచి ఈ నకిలీ నర్మద కంపెనీ విత్తన ప్యాకేట్లను మరికొందరు నిందితుల సహకారంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయించేవారన్నారు.

- Advertisement -

పోలీసులకు పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, మడికొండ, ఎనమాముల, వ్యవసాయశాఖ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నిన్నటి రోజున నిందితులను అరెస్టు చేసి విచారించగా నిందితులు పాల్పడిన నేరాలన్నీ అంగీకరించారన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, మామూనూర్ ఏసీపీ కృపాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యవసాయ అధికారులు ఉషాదయాల్, రవీందర్ సింగ్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ రావు, జనార్థన్ రెడ్డి, అల్లం రాంబాబు, ఎస్.శ్రీనివాస్, వేణు, మహేందర్, ఎస్.ఐలు దేవేందర్, భూక్యా చందర్, బండారి సంపత్, శరత్ కుమార్, లవనకుమార్, వి.రాజు, శ్రీకాంత్, ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేష్, కిరణ్, బిక్షపతి, రాజు, శ్యాం సుందర్, సురేష్, మహబూబ్ పాషా, కరుణాకర్, శ్రీధర్, విక్రమ్, సతీష్, రమేష్, నరేష్, నవీన్ కుమార్, వి.శ్రీనివాస్, గౌతం, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement