Friday, April 19, 2024

మ‌సీదు వ‌ద్ద పేలుడు.. ముగ్గురుకి గాయాలు

ఆఫ్ఘానిస్థాన్ లో ఓ మ‌సీదు వ‌ద్ద పేలుడు సంభ‌వించింది. ఫర్యాబ్ ప్రావిన్స్ లోని ఇమామ్ అబు హనీఫా మసీదు సమీపంలో పార్క్‌ చేసిన ఓ బైక్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.కాగా పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బందే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే ఆఫ్ఘానిస్థాన్ లో మరో ఘటన చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement