Friday, March 29, 2024

Exclusive: రామగుండం స్టేషన్ లో దారుణం.. రైలుకు ఎదురుగా నిలబడి ఏం చేశాడంటే.. వీడియో ఇదిగో..

రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఉదంతమిది. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో ఒడిశాకు చెందిన సంజయ్ కుమార్ బెహరా(28) రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ఎదురుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సంజయ్ రైలుకు ఎదురుగా నిల్చోవడం గమనించిన ప్రయాణికులు అర్థ నాదాలు చేస్తుండగా రైలు ఢీకొని చ‌నిపోయాడు. దీంతో రామగుండం రైల్వేస్టేషన్లో ప్రయాణికుల బెంబేలెత్తిపోయారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. సంజయ్ కుమార్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని సికింద్రాబాద్లోని హార్డ్వేర్ షాప్ లో పనిచేస్తున్న‌ట్లు తెలిసింది.

శనివారం తాతకు చెప్పి బయటికి వచ్చిన ఆయన రామగుండంలో ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. సంజయ్ మానసిక పరిస్థితి బాగాలేదని అని బంధువులు పేర్కొన్నట్లు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement