Friday, April 26, 2024

Khammam: తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్​ కానిస్టేబుళ్లపై కర్రలతో అటాక్​.. ఇద్దరికి తీవ్ర గాయాలు (వీడియో)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ కానిస్టేబుళ్లు తనిఖీలకు వెళ్లారు. సారా అమ్మే చర్లమండలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, చర్ల మండలంలోని ధనవాయిపేటలో అమ్మకదారుడుపై నిఘా పెట్టి పట్టుకునే క్రమంలో రివర్స్​లో కానిస్టేబుళ్లపై కర్రలతో అటాక్​ చేశారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీనిపై సీరియస్​ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement